శశిథరూర్‌కు బెయిల్‌ మంజూరు

– ముందస్తు బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ, జులై7(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌కు బెయిల్‌ మంజూరైంది. తన భార్య సునందపుష్కర్‌ మృతి కేసులో నిందితుడిగా ఉన్న థరూర్‌ శనివారం ఢిల్లీ కోర్టులో హాజరయ్యారు. ఇప్పటికే ఆయనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు కాగా.. కోర్టు దానిని సాధారణ బెయిల్‌గా మార్చింది. రూ.లక్ష పూచీకత్తుపై కోర్టు బెయిల్‌ ఇచ్చింది. థరూర్‌కు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ గురువారమే కోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. అయితే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని ఆదేశించింది. సునంద పుష్కర్‌ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) థరూర్‌పై 3000 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేసిన అనంతరం కోర్టు ఆయనను జులై 7న విచారణకు హాజరవ్వాల్సిందిగా సమన్లు పంపింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సిట్‌ వ్యతిరేకించింది. 2014 జనవరి 17న సునంద పుష్కర్‌ దిల్లీలోని ఓ ్గ/వ్‌ స్టార్‌ ¬టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. అంతకుముందు రెండ్రోజుల క్రితమే పుష్కర్‌ తన భర్త థరూర్‌కు, పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌తో సంబంధం ఉందని నిందిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. పుష్కర్‌ మరణించడానికి ముందు థరూర్‌ ఆమె ఫోన్‌కాల్స్‌ను నిర్లక్ష్యం చేశాడని.. అందువల్లే ఆమె సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారని ఆమె మృతిపై దర్యాప్తు చేసిన అధికారులు వెల్లడించారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని, హింసించారని థరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. సునంద మరణించడానికి ముందు ఆమె చేసిన ఈమెయిల్స్‌, మెసేజెస్‌, సోషల్‌ విూడియా పోస్ట్‌లు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.