శ్రీదేవి మృతిపై విచారణకు సుప్రీం నో
న్యూఢిల్లీ,మే11(జనం సాక్షి ):బాలీవుడ్ నటి శ్రీదేవి మరణంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఫిబ్రవరి 24న దుబాయిలోని ఓ ¬టల్లో ప్రమాదవశాత్తు బాత్టబ్లో మునిగిపోయి శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సునీల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్, డి.ఎ.చంద్రచూద్తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. అంతకు ముందు మార్చి 9న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా అనంతరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.