శ్రీనగర్‌లో లష్కరే తోయిబా తీవ్రవాది కాల్చివేత

శ్రీనగర్‌, జనంసాక్షి: జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌ లష్కరే తోయిబాకు
చెందిన ఓ తీవ్రవాదిని పోలీసులు కాల్చిచంపారు. ఈ సంఘటన శ్రీనగర్‌లోని నార్పరిస్తాన్‌ ప్రాంతంలో జరిగిందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలలో ఓ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌తో పాటు ఇద్దరు కాని స్టేబుళకు కూడా గాయాలయ్యాయని ఆయన తెలిపారు.