శ్రీ కృష్ణస్వామి కళ్యాణ మండపం ప్రారంభం

మల్దకల్ జూన్11(జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోని పల్లి గ్రామంలో వెలసిన శ్రీ నీ స్వయంభూ శ్రీ కృష్ణస్వామి దేవాలయం‌నందు భక్తుల సౌకర్యార్థం కీ.శే. బండ్ల అనంతమ్మ, కీ.శే బండ్ల‌ సవారెడ్డి జ్ఞాపకార్థం నిర్మించారు.సొంత ఖర్చులతో రూ.28‌లక్షల వ్యయంతో నూతన కళ్యాణమండపాన్ని చేపట్టారు.నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణస్వామి కళ్యాణ మండపాని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం మండపంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ కృష్ణ స్వామి దేవాలయంలో స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. పెళ్లీలు , ఇతర శుభకార్యలయాలకు దేవాలయం నందు నిర్వహించుకునేందుకు కల్యాణ మండప నిర్మించినట్లు పేర్కొన్నారు. సుమారు నాలుగు మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా సకల సౌకర్యాలు కల్పిస్తూ ఈ కళ్యాణ మండపం నిర్మించడం జరిగిందన్నారు.కళ్యాణ మండపంభక్తులు, పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీ కృష్ణస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి, మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటిసి ప్రభాకర్ రెడ్డి,సింగల్ విండో చైర్మన్ శేషంపల్లి తిమ్మారెడ్డి, కేటిఆర్ యువసేన ఉమ్మడిజిల్లా అధ్యక్షులు కృష్ణకుమార్ రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవరణ, టిఆర్ఎస్ నాయకులు రమేష్ రెడ్డి,మాజీ ఎంపీపీ సత్య రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.