శ్రీ ధనలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు

మల్దకల్ సెప్టెంబర్ 30(జనంసాక్షి)దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ అన్నపూర్ణ దేవిఅలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చాడు. తొమ్మిది రోజుల పాటు జరిగే అలంకరణలలో భక్తులకు శ్రీ ధనలక్ష్మి దేవిఅలంకరణ భక్తులకు ప్రత్యేక కుంకుమార్చన పూజలు, సామూహిక ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా దాతలుగా ఇల్లూరు సాయికుమార్,నరహరి సురేష్ శెట్టి,బిలకంటి అమర్నాథ్, పళ్ళ పావని,అల్లంపల్లి శేషయ్య, పల్లా నర్సిమయ్య,వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు బాదం శ్రీనివాసులు,మనసాని నాగరాజు ,ఇల్లూరి నాగరాజు, నరహరి వెంకటేష్ ,నరహరి ప్రవీణ్ ,పద్మనాభం ,సింగరేణి నరసింహయ్య ,నరహరి సూరిబాబు,ఇల్లూరి గంగాధర్, పల్లా సంతోష్, ఇల్లూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.