*శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు*

పెబ్బేరు సెప్టెంబర్ 30 (జనంసాక్షి):
పెబ్బేరు మున్సిపాలిటీలోని 4వ వార్డులో నవరాత్రుల భాగంగా చిన్న చౌడేశ్వరి ఆలయంలో గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు కె శుక్రవారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి పెబ్బేరు మాజీ సర్పంచ్ అక్కి సుశీల శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక  పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక సూపర్ కింగ్స్ యూత్ కమిటీ తరఫున పెబ్బేరు మాజీ సర్పంచ్ అక్కి సుశీల శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో సాయి గణేష్ యూత్ సభ్యులు, వినాయక సూపర్ కింగ్స్ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Attachments area