షీలాదీక్షిత్‌పై పోటీచేయనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి వ్యతిరేకంగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతవారమే ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వీలున్న 44 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.