షేర్ పల్లి గ్రామంలో బతుకమ్మ ఆడిన మహిళలు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 దసరా నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని ఉండవెల్లి మండల పరిధిలోని షేర్ పల్లి గ్రామంలో శుక్రవారం శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో వివిధ రకాల పూలతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న మహిళలు దుర్గామాత అమ్మవారి విగ్రహందగ్గరికి పాల్గొని తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగలో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివపుత్ర యూత్ సభ్యులు బాలరాజు, రాజ్ కుమార్, నరసింహ, డి.శేఖర్ మరియు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.