సనంద పుష్కర్ మృతి కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు…

న్యూఢిల్లీ:సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సాక్షులకు నిజనిర్ధారణ(లై డిటెక్షన్ టెస్ట్స్) పరీక్షలు జరిపేందుకు అనుమతించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. సాక్షులు కొన్ని విషయాలను దాచి పెడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 20న ముగ్గురు సాక్షులు కోర్టుకు హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షులుగా మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ సహాయకుడు నరేన్‌సింగ్, డ్రైవర్ బజ్‌రంగ్, స్నేహితుడు సంజయ్ దివాన్ ఉన్నారు.