సభ్యులు సమావేశానికి తప్పక హాజరు కావాలి

…ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరిత
రాజోలి 16 జులై(జనం సాక్షి)
ప్రతి సభ్యుడు మూడు నెలల కు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో తప్పకుండ హాజరు కావాలని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. మండల కేంద్రమైన రాజోలి లో మంగళవారం ఎంపీపీ మరియమ్మ ఆధ్వర్యంలో జరిగిన మండల సర్వాసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో జరుగుతున్న పనులు,జరిగిన పనులపై అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రతి శాఖ అధికారి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులనుపూర్తి చేయాలన్నారు. మండలంలో నిధులు సిద్ధంగా ఉన్నాయని వాటిని ప్రణాళిక బద్ధంగా వాడుకోవాలని తెలిపారు.మండలంలో రాజోలి నుండి పడమటి గార్లపాడు మీదుగా తుమ్మిళ్ల వరకు వేస్తున్న రోడ్డు పూర్తి కాగా మందొడ్డి వరకు వేస్తున్న రోడ్డు పనులు కూడా త్వరలోనే ముగుస్తుందని తెలిపారు.ఉపాధి హామీ,వ్యవసాయ,తదితర శాఖల్లో ని అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుగుణమ్మ, వైస్ ఎంపీపీ రేణుక, జిల్లా కో అప్షన్ సభ్యుడు. నిషాక్,ఎంపిడిఒ గోవిందు రావ్,తహసీల్దార్ జోషి శ్రీనివాస్ శర్మ,ఆయా గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు పాల్గొన్నారు.