సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిన ఉండాలి

-మండల బిజెపి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 11 : గ్రామాలలో పారదర్శక పాలన జరగాలంటే ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఇటిక్యాల మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎల్. జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై, నిధులకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని సూపరిడెంట్ అధికారి భారతికి సమాచార హక్కు చట్టo యొక్క వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పరిపాలన సవ్యంగా జరగాలంటే అవినీతికి తావులేకుండా అభివృద్ధిపై అప్పుడప్పుడు యువకులు సమాచార హక్కు చట్టాల ద్వారా నిధులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాఅధ్యక్షులు కేకే రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మాణిక్యరెడ్డి, మండలం ఉప అధ్యక్షులు మద్దిలేటి యాదవ్, మండలం మహిళా మోర్చా అధ్యక్షురాలు శారద పాల్గొన్నారు.