సాతపూర్ సర్పంచ్ భర్త పరుశురాం గుండె పోటుతో మృతి.

నివాళులు అర్పించిన వివిధ పార్టీల నేతలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 11(జనంసాక్షి):
పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సర్పంచ్ కుందెళ్ళ పద్మమ్మ భర్త కుందెళ్ళ పరుశురాం(49) గురువారం తెల్లవారు జామున అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందాడు.ఇతనికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.సంవత్సరం క్రితం కూతురుకు వివాహం చేశారు.పరుషరాం మృతి తో గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.గతంలో ఇతను వామపక్ష పార్టీలలో మరియు నక్సలైట్ ఉద్యమంలో చాలా చురుకుగా పని చేశారు.ప్రస్తుతం
మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ప్రదాన అనుచరుడుగా పేరు పొందాడు.మూడు సంవత్సరాల క్రితం ఉత్కంట భరితంగా జరిగిన సాతపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అతని భార్యను సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయించి గెలిపించుకున్నారు. పరుషరాం భౌతిక కాయానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు, వివిధ పార్టీల నాయకులు,గ్రామ ప్రజలు,యువకులు నివాళులు అర్పించి అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.