సానూభూతితోనే విజయం :దాడి

హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి) : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైకాపా విజయం సాధించిందని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన విశ్లేషణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. 2014లో ఈ పరిస్థితి రాదని అభివృద్ధే కొలమానంగా ఎన్నికల జరుగుతాయని ఆయనన్నారు. రాష్ట్రంలోని అన్నా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించామని కార్యకర్తలు ఇచ్చిన సలహాలు, సూచనలతో గెలుపు దిశగా ముందుకు సాగుతాయని దాడి అన్నారు.