సాయి నిఖిల్ ను అభినందించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

 

 

 

 

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 29 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆల్ ఇండియాలో జే ఈ ఈ అడ్వాన్స్ లో 232 ర్యాంకును సాధించిన సాయి నిఖిల్ ను గురువారము గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభినందించారు.జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు ప్రస్తుతం న్యూ హౌసింగ్ బోర్డ్ గద్వాలలో నివాస ఉంటున్న లక్ష్మయ్య శెట్టి, ప్రశాంతి ల కుమారుడు సాయి నిఖిల్ చదువుతోపాటు స్పోర్ట్స్ అన్నిటిలోను ముందుండేవాడు. కిందిస్థాయి తరగతి వరకు గద్వాల విశ్వభారతి స్కూల్లో, 9,10 ఇంటర్ వరకు శ్రీ చైతన్య లో చదువుతోపాటు కోచింగ్ కూడా తీసుకున్నారు. కాన్పూర్ నందు గద్వాల విద్యార్థికి సీటు లభించడం అభినందనదాయకమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సాయి నిఖిల్ కి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాలవేసి శాలవతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామాపురం కిరణ్ కుమార్, టీచర్ షబ్బీర్, జగదీశ్వర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ జంబురామన్ గౌడ్, గట్టు ఎంపీపీ విజయకుమార్, గద్వాల 18వ వార్డు కౌన్సిలర్ నరహరి గౌడు తదితరులు పాల్గొన్నారు.