సిఐ అంజిరెడ్డికి కేంద్ర హోంమంత్రి పతకం

మేడిపల్లి – జనంసాక్షి
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో భాగంగా కేసు దర్యాప్తుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎల్బీనగర్ సిఐ బి అంజిరెడ్డికి “కేంద్ర హోంమంత్రి పతకం – 2022” అవార్డు దక్కింది. గతంలో మేడిపల్లిలో పనిచేసిన ఆయన ఎన్నో కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించి చేదించారు. మేడిపల్లి మండల వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్థానికులను, ప్రజాప్రతినిధులను చైతన్యపరిచారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి పథకం అందుకోనున్న సందర్భంగా సిఐ అంజిరెడ్డికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరెన్నో పతకాలు అందుకోవాలని ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.