సియాచిన్‌ బేస్‌క్యాంప్‌ సందర్శించిన రాష్ట్రపతి

శ్రీనగర్‌,మే10(జ‌నం సాక్షి): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శీతల యుద్ధభూమి సియాచిన్‌ ఆర్మీ బేస్‌క్యాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం సందర్శించారు. సైనికులు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్కడి సైనికులతో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. రాష్ట్రపతి వెంట ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఉన్నారు. సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ను 2004లో మొట్టమొదట సందర్శించిన రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం). సియాచిన్‌ ను సందర్శించిన రెండవ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కావడం విశేషం. ఇక్కడ ఎముఎకలు కొరికే చలిలో సైనికులు విధులు నిర్వహిస్తారు.