సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సత్యం

ఎల్లారెడ్డి: సెప్టెంబర్ 2 (జనం సాక్షి )  ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో శుక్రవారం ఎంపి నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏడో వార్డులోఎంపి నిధుల ద్వారా మంజూరైనా ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారు కు సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు,  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి.  అధికార ప్రతినిధి రామప్ప, గ్రామ ఉపసర్పంచ్ గోనే శ్రీకాంత్ . టిఆర్ఎస్ నాయకులు నెల్లి గోపాల్   గ్రామ కమిటీ అధ్యక్షులు సెక్రెటరీ . కమిటీ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.