*సీఎంఓ కార్యాలయం నుంచి జోగుళాంబా దేవికి హోమద్రవ్యాలు*

*అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 30)*శక్తిపీఠమైన అలంపురం శ్రీ జోగుళాంబ అమ్మావారికి సీఎంఒ కార్యాలయం నుండి చండీహోమానికి అవసరమైన హోమ ద్రవ్యాలు శుక్రవారం అందాయి. సీఎం కేసీఆర్ కుటుంబం నుండి ఈ హోమ ద్రవ్యాలు పంపినట్టు ప్రతినిధులు బాపురెడ్డి , రాంచందర్ తెలిపారు. కాగా ఈపూజా  ద్రవ్యాలను ఆలయ ఈఓ పురేంధర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మకు అందజేశారు. దేవీ నవరాత్రులలో ఒక రోజు సీఎం కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనార్థం వస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆలయ సిబ్బంది రంగనాథ్. శేఖర్, బ్రహ్మయ్య ఆచారి ఉన్నారు