*సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు*

వీపనగండ్ల ఆగస్టు 11 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు. గత కొన్ని సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లను పక్కన పెట్టిన విషయం విధితమే అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటన ఆధారంగా మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడం జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుతుందని ఫీల్డ్ అసిస్టెంట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లారం ఫీల్డ్ అసిస్టెంట్ జగదీష్, పుల్గర్ చర్ల ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మి, సంగినేనిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్  గంగమ్మ, సంపత్ రావు పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.