సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారిశుద్ధ కార్మికులతో రాఖీ..

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 12(జనం సాక్షి)
 వరంగల్ తూర్పు నియోజకవర్గం చౌరస్తా నందు  టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్  పిలుపు మేరకు  ముఖ్యమంత్రివర్యులు కేసిఆర్  చిత్రపటానికి పారిశుద్ధ మహిళా కార్మికులతో శుక్రవారం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి రాఖీ కట్టించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్  మరియు మంత్రి కేటీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తుందని తెలియజేయడం జరిగింది….