సీఎం కేసీఆర్ బహిరంగ సభలో బుల్లెట్ల కలకలం

నర్సాపూర్. నవంబర్ 16 (జనం సాక్షి )
నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తి రూట్ లో గురువారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో అస్లమ్ అనే వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతూ హల్ చల్ చేశారు. దీనితో వెంటనే అతనిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని పరిశీలించగా అతని వద్ద రెండు బుల్లెట్లు దొరకడంతో వాటిని స్వాధీన పరుచుకున్నారు. ప్రస్తుతం అస్లామ్ ను పోలీసులు అద్బులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే పోలీసులు అతని వద్ద బుల్లెట్లు ఎలా వచ్చాయని కోణంలో విచారిస్తున్నారు. అయితే పోలీసులు చాకచక్యంగా సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ప్రోగ్రాం డిస్టబెన్స్ కాకుండా చాకచక్యంగా పక్కకు తీసుకెళ్లి విచారించి నిర్ధారణకు వచ్చారు.