సీఎం సిద్దరామయ్య ఓటమి

కర్నాటక ఎన్నికల్లో భాగంగా మైసూరు జిల్లాలోని చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సిద్దరామయ్య ఓటమి పాలయ్యాడు. JDS అభ్యర్ధి GT దేవెగౌడ విజయం సాధించారు. 18 వేల ఓట్ల తేడాతో సిద్దూ ఓటమిపాలవ్వడం కాంగ్రెస్ కు పెద్ద షాక్. అయితే రెండు నియోజకవర్గాల నుంచి సిద్దూ పోటీ చేస్తున్నప్పటికీ.. మరో నియోజకవర్గమైన బాదామిలో కూడా సిద్దూ వెనుకబడిపోయాడు. బాదామిలో బీజేపీ అభ్యర్ధి శ్రీరాములు ముందంజలో ఉన్నారు.