సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

-సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కట్ట బోయిన శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి)

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు సెప్టెంబర్ నాలుగు నుండి ఏడు వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరుగనున్న సందర్భంగా గోడ ప్రతులను సోమవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర సమితి సభ్యులు కట్టే బోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో బిజెపి, రాష్ట్రములో టిఆర్ఎస్ గడిచిన ఎనిమిది సంవత్సరాల పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని ప్రజల జీవన పరిస్థితులను సమీక్షించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఈ మహాసభలో రూపొందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా నిధులు నీళ్లు నియమకాలు ఆత్మ గౌరవ పరిపాలన ఆకాంక్షల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సెప్టెంబర్ 4న జరిగే ప్రజా ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, మేకపోతుల వెంకన్న, చౌకల బిక్షం, సంఘం వెంకన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు.