సుప్రీంను ఆశ్రయించిన ఛార్జర్స్‌ యాజమాన్యం

న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దు పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగింపును నిలిపివేయడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఛార్జర్స్‌ యాజమాన్యం బీసీసీఐ నిర్ణయానిరి వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్‌ వేసింది. దీనిపై కోర్టు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది.