సుభాష్ యువక బృందం ఆధ్వర్యంలో దుర్గ మాత పూజలు.

 

 

 

 

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి ప్రాంగణంలో సుభాష్ యువక బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం కాలనీవాసులు యువక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మహాలక్ష్మి ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ యజమాని జాజుల బాలరాజు ఆర్థిక సాయంతో నిర్వహించి నట్లు నిర్వాహకులు తెలిపారు అనంతరం మహిళలు,యువతులు బతుకమ్మలను ఏర్పాటు చేసి బొడ్డెమ్మలను ఆడారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగిందని తొమ్మిది రోజులపాటు వివిధరూపాలలో పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లక్ష్మీనారాయణ పరమేశ్ శివకుమార్ శేఖర్ దినేష్ కుమార్ ఆంజనేయులు తాడూరు శివ తదితరులు పాల్గొన్నారు