సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సురవరం మనవరం పుస్తక ఆవిష్కరణ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి) హైదరాబాద్ రవీంద్ర భారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సందర్భంగా 126 మంది కవుల, కవయిత్రులతో సురవరం మనవరం అనే కవితసంపుటిని గోల్కొండ సాహితీ కళాసమితి, ,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించడంజరిగింది.ఈ కవిత సంపుటిలో మల్డకల్ గ్రామవాసి సుంకరి బసవరాజప్ప,అధ్యాపకులు, కవి సురవరం ప్రతాపరెడ్డి పై ఈ సంకలనంలో తన కవిత ముద్రణ కావడం పట్ల నిర్వాహకులు అభినందించి సత్కారించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు కృష్ణ వర్థన్,తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జులూరి గౌరి శంకర్,తెలంగాణా అధికారభాష సంఘం అధ్యక్షురాలు మత్రి శ్రీదేవీ, అర్ధ చంద్ర ప్రకాష్ రెడ్డి, గంట మనోహర్రెడ్డి ,బడేసాబు, కవులు బైరోజు రాజశేఖర్,బైరోజు కవిత,రావురివనజ,శాంతరెడ్ది తదితరులు పాల్గొన్నారు.