సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లో కొత్త ప్రభుత్వం

బెంగుయి : సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్న తిరుగుబాటు నేత మైకేల్‌ డిజోటోడియా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా నియమితులైన సమాచార శాఖ మంత్రి క్రిస్టోఫీ గజ్‌ బెట్టీ కొత్త మంత్రివర్గ ఏర్పాటు గురించి నిన్న రాత్రి జాతీయ రేడియోలో ప్రకటన చేశారు. డిసెంబర్‌ 2012లో సెంట్రల్‌ ఆఫికన్‌ తిరుగుబాటు ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమకారుల దండయాత్రతో దేశ అధ్యక్షుడు బొజైజ్‌ దేశం వదలి పారిపోవడంతో డిజోటోడియా తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.