సెక్యూరిటీ గార్డును బెదిరించి ఇంట్లో దోపిడీ
భోపాల్,నవంబర్27 (జనంసాక్షి ) : మధ్యప్రదేశ్ ఇండోర్లోని లాసుడియా ఏరియాలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఓ బిల్టర్ ఇంటికి ఐదుగురు దుండగులు చేరుకున్నారు. ఇంటి బయట కూర్చున్న సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని తుపాకులు, మారణాయుధాలతో బెదిరించారు. ఆ ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్లి.. నగదుతో పాటు విలువైన వస్తువులను దుండగులు దొంగిలించారు. ఈ ఘటనపై బాధిత బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీగార్డును బెదిరించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యార్తు చేస్తున్నారు.