సైన్యం సాయంతో సహాయక చర్యలు: హర్యానా సీఎం

హర్యానా: వందేళ్లలో ఎన్నడూ రానంతగా యమునా నదికి 8లక్షల  క్యూసెక్కుల వరదనీరు చేరిందని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడా పేర్కొన్నారు. ఇకే నెలలో ఇంత భారీ స్థాయిలో వరదనీరు ఎప్పుడూ రాలేదన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ, సైన్యం తదతర బృందాలు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సహాయ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సీఎం చెప్పారు.