స్పా ముసుగులో వ్యవభిచారం

విదేశీయులతో నడుస్తున్న కేంద్రంపై దాడి

న్యూఢిల్లీ,జూలై5(జ‌నం సాక్షి ): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న 15 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అందులో అయిదుగురు విదేశీయులు ఉన్నారు. సెక్టర్‌ 29 మార్కెట్‌లో ఉన్న ఓ స్పా సెంటర్‌ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. థాయిలాండ్‌కు చెందిన అయిదుగురు మహిళలతో పాటు మణిపూర్‌కు చెందిన అయిదుగురు ఉన్నారు. ఇద్దరు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొత్త పోలీస్‌ కవిూషనర్‌ కేకే రావు ఆదేశాల మేరకు స్పా సెంటర్‌పై దాడులు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు గూర్గావ్‌ పోలీసు పీఆర్వో సుభాశ్‌ బోకన్‌ తెలిపారు. ఐపీసీ, ఫారినర్స్‌ యాక్ట్‌ కింద కేసును నమోదు చేశారు. స్పా ఓనర్‌ యుద్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.