స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో 2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన ఎంపీపీ

మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) 75వ స్వాతంత్ర భారత్ వజ్రోత్సవాలలో  భాగంగా మల్దకల్ మండల కేంద్రంలోని గురువారం స్థానిక ఎస్సై ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎంపీపీ వై రాజారెడ్డి ,సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి కలిసి 2కె ఫ్రీడమ్ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. పెట్రోల్ బంక్ రోడ్డు నుంచి కుర్తి రావులచెరువు  గ్రామ సమీపము వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్సై ఆర్ శేఖర్ మాట్లాడుతూ నేటి భావితరాలకు మనం వేసే ప్రతి అడుగు  స్ఫూర్తిదాయకంగా నిలువాలని ఆయన అన్నారు. ఆయురారోగ్యాలతో ఫిట్ ఇండియాలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, యోగతో  మనిషి శరీరం ఆయు ఆరోగ్యాలతో యోగను  ప్రపంచానికి పరిచయం చేసింది మనదేశమే అన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను స్వతంత్ర స్ఫూర్తిని చాటుదామన్నారు.ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న ,తహసీల్దారు హరికృష్ణ,సర్పంచ్ యాకోబు,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటన్న ,మాజీ సింగల్ విండో అధ్యక్షుడు విక్రమ్ సింహరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి, ఆంజనేయులు, అజయ్, మహబూబ్ అలీ, ఎంపిటిసి గోపాల్ రెడ్డి, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు._