స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం రన్ కార్యక్రమంలో పాల్గొన్న…

-జెడ్పిటిసి పద్మ వేంకటేశ్వర రెడ్డి, ఎంపిపి నజ్మూనిస బేగం…
గద్వాల రూరల్ ఆగష్టు 11 (జనంసాక్షి):- ఆజాదీకా అమృత్ మహోత్సవ్ 2కే రాన్ కార్యక్రమంలో భాగంగా ధరూర్ మండల కేంద్రము లో ఉదయం వైయస్సార్ చౌరస్తా నుండి ర్యాలీని ప్రారంభించి,ఫ్రీడం రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ధరూర్ మండలంలో  2కే రాన్ లో పాల్గొన్న ప్రతిఒక్కరు కూడా దేశభక్తితో ముందుకు నడవాలని సూచించారు..ఈ కార్యక్రమంలో  తహసీల్దారు వేంకటేశ్వర్లు, ఎంపిడిఓ జబ్బార్, ఎస్సై కర్నె శేఖర్ రెడ్డి,సర్పంచ్ పద్మమ్మ,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, అబ్రహం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…