స్వాతంతో్యద్యమంలో క్రిస్టియన్లు సహకరించలేదు

– బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబయి, జులై6(జ‌నం సాక్షి ) : బాధ్యత కలిగిన ఎంపీలు ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలతో తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే దళితులపై, ముస్లింలపై బీజేపీ నేతలు పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా ముంబై నార్త్‌కు చెందిన బీజేపీ ఎంపీ గోపాల్‌ శెట్టి కైస్త్రవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనమవుతోంది. స్వాతంత్య పోరాటానికి కైస్త్రవులు పాటుపడలేదని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగకుండా కైస్త్రవులను అంగ్రేజీలు (విదేశీయులు)గా సంబోధించారు. హిందువులు, ముస్లింలు మాత్రమే దేశ స్వాతంత్యోద్య్రమంలో కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. కైస్త్రవులు బ్రిటిషర్లేనని, అందువల్లే వారు స్వాతంత్య పోరాటంలో పాల్గొనలేదన్నారు. హిందువుల వల్లో ముస్లింల వల్లో కాకుండా అంతా కలిసి పోరాడితేనే స్వాతంత్యం వచ్చిందని గోపాల్‌ శెట్టి పేర్కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. గత ఆదివారంనాడు షియా కబరిస్థాన్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఈద్‌-ఇ-మిలాద్‌ కార్యక్రమంలో పాల్గొంటూ బీజేపీ ఎంపీ ఈ వివాద్సపద వ్యాఖ్యలు చేశారు.