స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో కవి బసవరాజప్ప కు సన్మానం

మల్దకల్ ఆగస్టు 17 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో బాల భవనంలో ఈనెల 16వ తేదీ జరిగినకవి సమ్మేళనంలో మల్దకల్ గ్రామానికి చెందిన అధ్యాపకులుసుంకరి బసవరాజప్పను బాల భవనంలో ఘనంగా సన్మానించారు.
75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రభాష, సాంస్కృతిక శాఖ గద్వాల్ జిల్లా ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన స్వతంత్ర స్ఫూర్తి ,వజ్రోత్సవ,దీప్తి,అనే అంశంపై కవి సమ్మేళన జరిగింది.ఈ అంశం పై కవిత కవితా పఠానం చేసినందుకు అధ్యాపకులు సుంకరి బసవరాజప్పను,జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సన్మానం చేసి ,ప్రశంసాపత్రం అందజేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ,జిల్లా విద్యాశాఖ అధికారి
సిరాజుద్దీన్, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఎస్సి కార్పొరేషన్ రమేష్ బాబు,కవులు బైరోజు రాజశేఖర్,వెంకట్రామయ్య శెట్టి,ఊర్ల ఈశ్వర్ రెడ్డి,బొరవేలి పవన్ కుమార్,అంబటి భానుప్రకాసు,అనిమెని మహేందర్,డోలు బుచ్ఛన్న, డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు ఇతరకవులు,కళాకారులు,అభిమానులు పాల్గొన్నారు.