హంతకుడు నిఖిల్‌ హండాకు 14రోజుల రిమాండ్‌

న్యూఢిల్లీ,జూన్‌29(జనం సాక్షి): ఆర్మీ మేజర్‌ భార్య శైలజ ద్వివేది హత్య కేసులో నిందితుడు నిఖిల్‌హండాకు ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఈ కేసులో నిందితుడు నిఖిల్‌ హండాను పోలీసులు ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ మనీషా త్రిపాఠి ఎదుట హాజరుపరిచారు. దీనిపై విచారించిన కోర్టు నిఖిర్‌ హండాకు కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. ఆర్మీ మేజర్‌ అమిత్‌ ద్వివేది భార్య శైలజ ద్వివేదిని హత్య చేసిన కేసులో మరో ఆర్మీ మేజర్‌ నిఖిల్‌ హండాను విూరట్‌ పోలీసులు జూన్‌ 24న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తోటి ఉద్యోగి భార్య అని చూడకుండా ఆమెను కిరాతకంగా హత్య గావించాడు.