హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌: 20 మంది ప్రాణాలను హరించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌ఎకె బ్రౌనె అన్నారు. ప్రమాదానికి గురైన ఎంఐ-17 వి5 తాలూకు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డరు లభించిందని దాన్ని విశ్లేషిస్తే కారణం కొంతవరకు తెలిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు వాయుసేనకు చెందిన వారు కాగా, 9మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆరుగురు ఐటీబీపీ సిబ్బంది ఉన్నారని బ్రౌనె తెలిపారు. ఇప్పటివరకు 17 మృతదేహాలను వెలికి తీశారు.