హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

హైదరాబాద్‌:నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం కృష్ణడెల్టాకు  నీటిని విడుదల చేయటంపై ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రభుత్వానికి సిగ్గుచేటు, చెంపపెట్టు లాంటిదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతుందని ఆయన అన్నారు.