•75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగుర వేద్దాం

•స్వాతంత్ర భారత కీర్తిని దశదిశలా చాటుదాం

జనం సాక్షి, వంగూర్:
తెలంగాణ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్ర పోరాట యోధులను సమర్థిస్తూ వారి స్ఫూర్తితో ప్రగతి ప్రయాణం కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు యావత్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకుగాను వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ సన్నిధిలో జాతీయ మువ్వన్నెల జెండా లను కేటీఆర్ జిల్లా సేవాసమితి అధ్యక్షుడు అంకు సురేందర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ కిషన్ ,గ్రామ సర్పంచ్ చెన్నయ్య , ఎంపీటీసీ గీతవిజయపాల్ రెడ్డి , జంగయ్య ,వార్డ్ మెంబర్ రాములు, సాయన్న, వెంకట్ నారాయణ, కాశి నాథన్, బాలయ్య, హోలీ మహమ్మద్, ఎల్లయ్య, వెంకటయ్య, పంచాయతీ సిబ్బంది లింగమయ్య , బక్కయ్య, బాలమైసమ్మ ,పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.