12న మఖ్తల్లో తిరంగా యాత్ర -బీజేవైయం మఖ్తల్ శాఖ

మక్తల్ ఆగస్టు 09 (జనంసాక్షి) జాతీయ బీజేపీ పార్టీ సూచన మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ కేంద్రంలో తిరంగా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేవైయం జిల్లా నాయకులు మంజునాథ్, మహేష్ సాగర్, పట్టణ అధ్యక్షుడు కావాలి నర్సింహా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటే విదంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశానుసారం హర్ ఘర్ తిరంగా యాత్రను కూడా ప్రతిఒక్క భారతీయుడు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. మఖ్తల్ పట్టణంలో ఈనెల 12న నిర్వహించే బైక్ ర్యాలీని బీజేవైయం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శిలు రామకృష్ణ, రాజేష్ సాగర్, ఆనంపల్లి రమేష్, రాజగౌడ్, బ్యాటరీ రాజులు పాల్గొన్నారు.