12న రాజ్యసభకు టీ బిల్లు: ఆహ్మద్‌ పటేల్‌

న్యూఢిల్లీ: ఈ నెల 12న తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ ముగిసిన అనంతరం సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ మీడియాకు తెలిపారు. ఈ బిల్లుకు ప్రభుత్వం అధికారికంగా 32 సవరణలు ప్రతిపాదించనున్నట్టు వెల్లడించారు.