పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- నిండుకుండలా పాకాల చెరువు
- అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
- తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
- దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
- గ్రామాల అభివృధి దిశగా ప్రజాపాలన :సర్పంచ్ గద్దల నవీన్
- నేత్రపర్వంగా హనుమాన్ శోభాయాత్ర
- సమస్యల పరిష్కారానికి గ్రామసభలు
- మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు
- 2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు
- ‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్
- మరిన్ని వార్తలు


