పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- బస్సు ప్రమాద ఘటనపై డీజీపీతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- మరిన్ని వార్తలు



