పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- ప్రభుత్వ పాఠశాలల వైపు గ్రామం.. సంచలన నిర్ణయం తీసుకున్న న్యావనంది ప్రజలు
- సిరికొండ మండల ఉప సర్పంచ్ల ఫోరం ఏర్పాటు
- బోనమెత్తిన మెదక్ మున్నూరు కాపు సంఘం
- నూతన గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక
- సిరికొండలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు
- ఒకే ఏడాదిలో 8 మంది విద్యార్థులకు ఐఐఐటీ సీట్లు
- భూపాలపల్లిలో ఘోర ప్రమాదం..
- నిస్వార్థ ప్రేమకు నిలువుటద్దం నాన్న
- “నేనుసైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
- మానవతా సేవలో పోలీసు శాఖ..
- మరిన్ని వార్తలు



