పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- సూత్రప్రాయంగా.. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఛత్తీస్గఢ్ అంగీకారం!
- అబూజ్మడ్ ఎన్కౌంటర్లో ..
- గడ్చిరోలిలో ఎన్కౌంటర్
- పాక్ అణుబెదరింపులకు తలొగ్గం
- మరిన్ని వార్తలు