పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- ఘనంగా లయోలా హైస్కూల్లో సైన్స్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్
- సిద్దిపల్లె లో ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించిన మేనేజర్
- రాజ్యసభకు వెళ్తున్నా..
- తగ్గేదేలే అంటున్న ఇరాన్
- అయతుల్లా అలీ ఖమేనీకి భారత్ అధికార నివాళి
- ఖమేనీ కుమారుడే వారుసుడు?
- ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా ఉక్కుపాదం
- మావోయిస్టు పార్టీ లీగల్కు అనుమతివ్వండి
- తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి
- ఖమేనీ హత్యపై మౌనమెందుకు?
- మరిన్ని వార్తలు


