పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు