దాడి ఘటనపై సుప్రీంను ఆశ్రయిస్తా: అగ్నివేశ్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నారు. తనపై దాడి జరిగి రెండు వారాలు గడుస్తున్నా.. ఆ ఘటనపై ఎటువంటి అరెస్టులు జరగలేదని ఆయన అన్నారు. దాడి ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని సుప్రీంను డిమాండ్‌ చేయనున్నట్లు తయన తెలిపారు. కావాలనే తనపై జరిగిన దాడిని కప్పిపుచ్చుతున్నారని ఆయన ఆరోపించారు. తనపై దాడి ఓ వ్యూహం ప్రకారం కావాలనే జరిదగిందన్నారు. దీనిపై పోలీసులు తోణ చర్యలు తీసుకుని ఉంటే అనుమానం వచ్చేది కాదన్నారు.