131కి చేరిన మృతుల సంఖ్య

షిమ్లా : ఉత్తరాదిన వర్షబీభత్సానికి మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగానే 131కి చేరినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌లో 102 మంది చనిపోగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో 29 మంది మృతిచెందారు. దాదాపు 73 వేల మంది యాత్రికులు హిమాలయ ప్రాంతాల్లోని వివిధ పుణ్యక్షేత్రాల వద్ద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తీర్థయాత్ర సాగే మార్గంలో సహాయక చర్యలకు వెళ్లిన వాళ్లు ఇస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ప్రాణనష్టం వేలల్లో ఉండే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు.