14వ రోజు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె, సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 6 (జనం సాక్షి);
  జోగులాంబ గద్వాల జిల్లా లోని వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల నిరవధిక సమ్మె శనివారానికి 13వ రోజుకు చేరుకొంది అందుకు బిజెపి నాయకులు వీఆర్ఏలకు మద్దతుగా సంఘీభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల సమస్యలపై ప్రతి మండల కేంద్రం ముందు టెంట్లు వేసుకొని నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని, తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా వీఆర్ఏల సంఘం ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మన్న అన్నారు. ఈ నిరవధిక సమ్మెకు మద్దతుగా జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రవిరెడ్డి, వడ్డేపల్లి మండల అధ్యక్షులు కె.పెద్ద నరసింహులు, బిజెపి కార్యకర్తలు వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల వీఆర్ఏల అధ్యక్షుడు ఈశ్వర్, నాగరాజు ,మమత, అనసూయ, మద్దిలేటి, ఖాజా హుస్సేన్, సొరగారి పెద్ద బీచుపల్లి వివిధ గ్రామ వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.