14 బొగ్గు గనులపై నేడు ఐఎంజీ నిర్ణయం

ఢిల్లీ: వివిధ సంస్థలకు కేటాయించిన బొగ్గు గనుల్లో పురోగతిని పరిశీలించేందుకు ఏర్పాటైన అంతర్‌ మంత్రివర్గ బృందం (ఐఎంజీ) సోమవారం సమావేశం కానున్నట్లు తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన 14 బొగ్గు గనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన  8 గనులను రద్దు చేస్తూ కొద్దిరోజుల క్రితం ఐఎంజీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.