157 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆటబీశాఖ, పోలీసు అధికారులు అరెస్టు చేశారు. భారీగా స్మగ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం తెలియటంతో రెండు శాఖల అధికారులూ సంయుక్తంగా దాడులు చేశారు. 157మంది స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. రెండు లారీల్లో రవాణా అవుతున్న 2.20 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.