16కు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. ఓమ్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నల్గొండ జిల్లాకు చెందిన గిరి మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో గాయపడిన 117 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.