logo
logo
logo
  • వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఎడిట్ పేజీ
  • తెలంగాణ
  • స్పోర్ట్స్
  • బిజినెస్
  • సాహిత్యం
  • ఈ పేపర్
  • మరిన్ని +
    • గ్యాలరీ
    • వీడియోస్
    • సీమాంధ్ర
  • by Owen Williams
  • June 13, 2023
  • 15k
  • 278
  • 189
Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > రంగారెడ్డి > Main > / Posted on June 22, 2022

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to email a link to a friend (Opens in new window)
  • Click to share on LinkedIn (Opens in new window)
  • Click to share on Telegram (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఏప్రిల్ 30, 1910 జన్మించారు. ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ప్రసిద్ధుడు. ఆయన హేతువాది, నాస్తికుడు. మహాప్రస్థానం అతని రచనల్లో ప్రసిద్ధమైనది .
శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది – కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని రాసేవాడు. తన 18 వ ఏట 1928 లో “ప్రభవ” అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాశాడు. ఇలాచేయడం “గురజాడ అడుగుజాడ” అని అతను అన్నాడు .
1981లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో అతను ఈ విషయం స్వయంగా రాసాడు.
“ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను ‘సామాజిక వాస్తవికత ‘ అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది.”
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో అతని ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి “రాజా లక్ష్మీ ఫౌండేషను” అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970లో అతని షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
 *సినిమా రంగం*
తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి ఇతడు మాటలు, పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం “నీరా ఔర్ నందా”కి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చెయ్యడం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతను చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు.
తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు.
జానపదబ్రహ్మ 1999, మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు.
కొదుమూరి స్వప్న
పెద్ద అంబర్ పేట్
Attachments area
ReplyForward
 
  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to email a link to a friend (Opens in new window)
  • Click to share on LinkedIn (Opens in new window)
  • Click to share on Telegram (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Related

epaper

తాజావార్తలు

  • సభ సజావుగా సాగేలా సహకరించండి
  • రాజస్థాన్‌లో విషాదం
  • యూపీలో సర్కారు విద్య హుళక్కి!
  • రష్యాలో ఘోర విమాన ప్రమాదం
  • భారత్‌-బ్రిటన్‌ మధ్య చారిత్రక ఒప్పందం
  • తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
  • రాహుల్‌ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
  • భారత్‌ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
  • ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
  • పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్‌
  • మరిన్ని వార్తలు

ముఖ్యాంశాలు

  • Saturday, July 26th, 2025

సభ సజావుగా సాగేలా సహకరించండి

  • బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీది
  • బీసీ రిజర్వేషన్లను బీజేపీ నీరుగార్చే యత్నం
  • రాజస్థాన్‌లో విషాదం
  • మళ్లీ అధికారం మాదే..
  • తెలంగాణ కులగణన భూకంపం సృష్టించింది

జాతీయం

మరిన్ని

సభ సజావుగా సాగేలా సహకరించండి

రాజస్థాన్‌లో విషాదం

యూపీలో సర్కారు విద్య హుళక్కి!

  • Home
  • About
  • Products
  • Career
  • Advertisement
  • Team
  • Contact Us

Categories

  • Business
  • Sports
  • Seemandhra
  • Sahithyam
  • Education
  • Featured News

Trending

  • Edit Page
  • Cover Stories
  • Business

Districts

  • Warangal
  • Karimnagar
  • Mahabubnagar
  • Adilabad
  • Khammam
  • Nalgonda
  • Nizamabad
  • Medhak
  • Rangareddy
  • Tech
  • Movie
  • Music

Social

  • Facebook
  • Youtube
  • Twitter
  • Telegram

© 2023, Janamsakshi. All rights reserve