17న భోపాల్లో రాహుల్ రోడ్షో
భోపాల్,సెప్టెంబర్15(జనంసాక్షి): ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెప్టెంబరు 17న భోపాల్లో రోడ్ షో నిర్వహించ నున్నారు. 12 కిలోవిూటర్లు పొడవున సాగే ఈ రోడ్ షో అనంతరం రాహుల్ 15 వేలమంది పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రాహుల్ పర్యటనకు సంబంధించిన వివరాలను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విూడియా విభాగం అధ్యక్షుడు శోభా ఓఝా వివరించారు. సెప్టెంబరు 17న మధ్యాహ్నం రాహుల్ భోపాల్ చేరుకుని అక్కడి నుంచి లాల్ఘాటీ సర్కిల్కు వస్తారని తెలిపారు. అక్కడినుంచి బస్సులో రోడ్ షో కొనసాగుతుందన్నారు.