18 గుండె వైద్య సేవలు నిలిపివేత
కాకినాడ, సెప్టెంబర్ 16 : సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 18న గుండె వైద్య సేవలు నిలిపివేయనున్నారు. కాకినాడ బోధన్ ఆసుపత్రిలోని గుండె వ్యాధుల విభాగం సేవలు స్తంభించనున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ రోజు నుంచి ఔవుట్ పేషెంట్ల వైద్య సేవలు బహిష్కరించేందుకు వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు 14న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధరాజుకు వైద్యులు నోటిలు అందజేశారు. 18న ఔట్ పేషెంట్ల సేవతోపాటు ఆసుపత్రులోని వివిధ వార్డుల్లో కూడా వైద్య సేవలను స్తంభించప చేయనున్నారు. స్రపస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది ఇన్పేషెంట్లను డిశ్చార్జీ చేస్తారు.



